తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠ క్యూకాంప్లెక్సుల్లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న శ్రీవారిని 68,354 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24,259 మంది భక్తులు వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.