పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండు జట్టులో ఓ వైరస్ కలకలం సృష్టించింది. జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్తో పాటు 13మంది సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హోటల్ గదిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యబృందం సూచించినట్లు తెలిసింది. రావల్పిండి వేదికగా పాకిస్థాన్తో రేపు ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టు సభ్యులు అనారోగ్యం బారిన పడటంతో మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు చర్చిస్తున్నాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
14మంది ఆటగాళ్లకు వైరస్ లక్షణాలు

© ANI Photo