ఆంధ్రప్రదేశ్లోనే 2021-22లో ఎక్కువగా మాదక ద్రవ్యాలు లభ్యమైనట్లు కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా పట్టుబడిన డ్రగ్స్, అక్రమ ఆయుధాలపై స్మగ్లింగ్ ఇన్ ఇండియా పేరుతో నివేదిక విడుదల చేసింది. ఒక్క ఏపీలోనే 18 వేల కిలోల మాదక ద్రవ్యాలు, వెయ్యి కిలోల గంజాయి దొరికిందని పేర్కొన్నారు. 97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. తెలంగాణలో వెయ్యి కిలోల డ్రగ్స్,మత్తు పదార్థాలు పట్టుబడినట్లు వెల్లడించింది.