అదిరిపోయే ఫీచర్లతో భారత్ మార్కెట్లోకి డీఫై ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు రానుంది. ప్రవాగ్ సంస్థకు చెందిన ఈ కారులో 30 నిమిషాల ఛార్జింగ్తో 504 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ సంస్థ ఈ కారును డిజైన్ చేసింది. నవంబర్ 25న డీఫై ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారును రివీల్ చేయనుంది. ఇది టూ డోర్, ఫోర్ సీటర్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు. దీని టాప్ స్పీడ్ 200 కి.మీ. కేవలం 5 సెకన్లలోపే 100 కి.మీ వేగం అందుకుంటుంది. కాగా కారు ధరకు సంబంధించిన వివరాలను ప్రకటించాల్సి ఉంది.
30 నిమిషాల ఛార్జ్తో 504 కి.మీ ప్రయాణం

Courtesy Twitter: anupam singh