కేఎల్ రాహుల్ స్థానంలో టెస్టు జట్టులోకి వచ్చిన యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో WTC ఫైనల్కు భారత్ అర్హత సాధిస్తే రాహుల్ స్థానంలో గిల్నే కొనసాగించాలని డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ ‘శుభ్మన్ గిల్ ప్రదర్శన అద్భుతం. ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటే గిల్నే ఓపెనర్గా చూడాలని ఉంది. అతడు రేసు గుర్రంలాంటివాడు. అందుకే, పదేళ్ల తర్వాత కూడా శుభ్మన్ గిల్నే టీమ్ఇండియా తరఫున ఓపెనర్గా చూడాలని అనుకుంటున్నాను’ అని అన్నాడు.