కేరళలోని ట్రాన్స్జెండర్ జంట జియా, జహద్లు తల్లిదండ్రులయ్యారు. తమ ఎన్నో ఏళ్ల కల సాకారమైందంటూ ఆనంద భాష్పాలు కార్చారు. గతంలో జహద్ ప్రెగ్నెన్సీ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఓ ట్రాన్స్జెండర్ జంట తల్లిదండ్రులు కావడం భారత్లో ఇదే తొలిసారి. అయితే, పుట్టింది కుమారుడా, కుమార్తెనా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ, శిశువు ఆరోగ్యంగా ఉందని, 2.9కిలోల బరువు ఉన్నట్లు ఈ పేరెంట్స్ తెలిపారు. పుట్టుకతో స్త్రీ అయిన జహద్ పురుషుడిగా మారాలని సర్జరీ చేయించుకునే లోపే గర్భం దాల్చారు. దీంతో ఈ ప్రక్రియను వాయిదా వేసుకున్నారు.
-
Screengrab Instagram:paval19
-
© File Photo