ఈ నెల 15 నుంచి 29వరకు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చెన్నైలో ఈ ర్యాలీ జరుగుతుందని వెల్లడించారు. అగ్నివీర్(మెన్), అగ్నివీర్(మహిళా మిలిటరీ పోలీస్), సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్(వెటర్నరీ), జూనియర్ కమిషన్డ్ పోస్టులను ఈ ర్యాలీలో భర్తీ చేయనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, www.joinindianarmy.nic.in వెబ్సైట్ని సంప్రదించాలని సూచించారు.
15నుంచి ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్ ర్యాలీ

© ANI Photo(file)