బాలీవుడ్ కపుల్ అలియా, రణ్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంటిపై కెమెరామెన్లు ఫోకస్ చేయడంపై అసహనానికి గురయ్యారు. తమకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుందని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగనీయొద్దని వేడుకున్నారు. ఇటీవల అలియా కుమార్తెతో బాల్కనీలో కూర్చుని ఉండగా ఎవరో గమనిస్తున్నట్లు అనుమానించి చూసింది. దీంతో పక్కింట్లో కెమెరాలు పెట్టి తమకోసం రెడీగా ఉన్న ఫొటోగ్రాఫర్లపై విరుచుకుపడింది. దీనిపై రణ్బీర్ స్పందిస్తూ ఇలాగే వెంటపడితే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. గతేడాది కూతురుకు జన్మనిచ్చిన అనంతరం ఈ ఫ్యామిలీపై మీడియా ఫోకస్ పెరిగింది.