యూపీలోని కాన్పూర్లో దారుణం జరిగింది. 16 ఏళ్ల అమ్మాయిపై ఇన్స్టాలో పరిచయమైన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక తన స్నేహితులతో కలిసి గ్యాంగ్రేప్నకు ప్రయత్నిచగా.. బాలిక తప్పించుకుని ఇంటికి చేరుకుంది. బాలికను ఓ హుక్కా బార్కు రప్పించిన నిందితుడు ఆమె కూల్డ్రింగ్లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి స్నేహితులతో లైంగిక దాడికి ప్రయత్నించగా బాలిక తప్పించుకుంది. తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినయ్ ఠాకూర్ అనే యువకుడితో పాటు మరో 7గురిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.