ఈ నెల 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 24 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ నజీర్ అహ్మద్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత శాసనసభ, శాసనమండలి బీఏసీ సమావేశాలు జరుగుతాయి. మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. కాగా ఈ నెల 17న ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2023-24 బడ్జెట్ రూ.2.60 లక్షల కోట్లు ఉండనున్నట్లు సమాచారం.