మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆఫీస్లోకి చొరబడి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అక్కడ్నుంచే క్యూ న్యూస్ ఛానెల్ను మల్లన్న నిర్వహిస్తున్నాడు. ఆదివారం కావటంతో సిబ్బంది తక్కువగా ఉన్నారు. నిందితులు అక్కడ్నుంచి పారిపోయారు. కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.