పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై పోలీసులు ఉగ్రవాదం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఇమ్రాన్ స్థాపించిన ‘పీటీఐ’ పార్టీపై నిషేధం విధించనున్నారు. ఇస్లామాబాద్లోని ఓ కోర్టు వెలుపల పీటీఐ కార్యకర్తలు విధ్వంసం సృష్టించినందుకుగానూ ఇమ్రాన్తో పాటు మరో 10 మంది పీటీఐ నేతలపై కూడా ఉగ్రవాదం కేసు మోపారు. కాగా లాహోర్లోని ఇమ్రాన్ ఇంట్లో పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు లభ్యమైనట్లు పాకిస్తాన్ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు.