చండూరు సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తిప్పికొట్టారు. తాను టోపీ పెట్టుకుని వచ్చి.. మనుగోడు ప్రజలకు టోపీ పెట్టారని విమర్శించారు. అక్కడ ఓడిపోతారని తెలిసినా సీఎం గంభీరంగా మాట్లాడే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. చేనేత కార్మికులకు 2018లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ‘జీఎస్టీలో రాష్ట్ర వాటా 2.5శాతం ఎందుకు తగ్గించట్లేదు? డిండి ప్రాజెక్టును ఏడాదిలో ఎందుకు పూర్తిచేయలేదు? తాము ఏ తప్పూ చేయనప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలుపై ప్రమాణం ఎందుకు చేయట్లేదు?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.