TS: సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. పే రివిజన్ కమిషన్(పీఆర్సీ)ని ఏర్పాటు చేయాలని లేఖలో సంజయ్ పేర్కొన్నారు. ప్రతి నెల 1న ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఆయన ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాల్సింది పోయి ప్రభుత్వం కాలరాస్తోందని సంజయ్ విమర్శించారు. నూతన పీఆర్సీని ఏర్పాటు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని బీజేపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.