ఈనెల 16 నుంచి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టనున్నారు. ఆదిలాబాద్ జిల్లా- పిప్రీ నుంచి ప్రారంభించనున్నారు. జూన్ 15 వరకు పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 91 రోజుల పాటు 39 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. జూన్ 15 ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగుస్తుంది. బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని భట్టి విక్రమార్క విమర్శించారు.