ఉగాది పండుగ పురస్కరించుకుని ఈ నెల 22న తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది..ఈ సందర్భంగా 21, 22 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవలను కూడా రద్దు చేసినట్లు వివరించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.