నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్త తన సినిమా పాటను వేస్తే గోపిరెడ్డి మండిపడటాన్ని ప్రస్తావించారు. సినిమా పాటలను రాజకీయాలకు ఆపాదించడం ఏమిటని ప్రశ్నించారు. తాను మూడో కన్ను తెరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోని మసులుకోవాలని మండిపడ్డారు. అన్ని పార్టీల్లో తన అభిమానులు ఉంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.