వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. నాలుగున్నర గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. న్యాయవాది నాగార్జున సమక్షంలో అవినాశ్ను ఎస్పీ రామ్సింగ్ విచారించారు. ఈ మేరకు అవినాశ్ స్టేట్మెంట్ను సీబీఐ రికార్డు చేసింది. గతంలో జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న విచారించిన సీబీఐ.. ప్రస్తుతం ఇవాళ నాలుగో సారి ప్రశ్నించింది. కాగా తమ తీర్పు వెలువరించేవరకూ అవినాశ్ను అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐని హైకోర్టు ఆదేశించింది.