కుప్పం పర్యటనలో చంద్రబాబు వ్యవహారశైలిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. ‘చంద్రబాబు వ్యాఖ్యలు జుగుప్సాకరం. ఆయన వల్ల రాజకీయ నేతల విలువ పోతోంది. టీడీపీ కార్యకర్తలు పుంగనూరులో రాళ్ల దాడి చేశారు. పోలీసులను కొట్టేలా కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. కుప్పంలో లాఠీఛార్జికి ఆయనే కారణం. జీవో నంబర్ 1 ప్రతిపక్షాలకు, వైసీపీకి అన్ని పార్టీలకు వర్తిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.