రెండేళ్లుగా సహజీవనం చేసిన ప్రియురాలిని అనుమానంతో హత్య చేశాడో వ్యక్తి. నేపాల్కు చెందిన కృష్ణకుమారి, సంతోష్ దాలి మూడేళ్ల కిందట వేర్వేరుగా బెంగుళూరుకి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో రెండేళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే, బ్యుటీషియన్గా పనిచేసే కృష్ణకుమారి ప్రవర్తనలో మార్పు కనిపించింది. ఈ విషయమై ఇరువురు పలుమార్లు గొడవలు పెట్టుకున్నారు. దీంతో ఆమె గొంతు నులిమి హత్యాయత్నం చేశాడు. ఆసుపత్రికి తరలించగా అక్కడ అనుమానాస్పదంగా మృతిచెందడంతో సంతోష్ని అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు.
రెండేళ్లుగా సహజీవనం.. ఆపై హత్య

© Envato(representational)