సెహ్వాగ్, పంత్ల మధ్య పోలికలున్నాయని టీమిండియా ప్లేయర్ చెతేశ్వర్ పుజారా వెల్లడించాడు. వీరిద్దరూ టెస్టుల్లో దూకుడుగా ఆడుతారని చెప్పాడు. వాళ్ల సామర్థ్యంపై నమ్మకం ఉంచి ప్రత్యర్థి బౌలర్లపై అటాక్ చేస్తారని పుజారా తెలిపాడు. ఈ నెల 9న భారత్, ఆస్ట్రేలియాల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న దృష్ట్యా పుజారా ఈ వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో సెహ్వాగ్, పంత్లతో కలిసి ఆడిన అనుభవం పుజారాకు ఉంది. ఈ సందర్భంగా పంత్, సెహ్వాగ్ల గురించి పుజారా ప్రస్తావించాడు. కాగా, కారు ప్రమాదంతో పంత్ ఈ సిరీస్కు దూరమయ్యాడు.