బెంగళూరు, మైసూర్ ఎక్స్ప్రెస్ వే కర్ణాటక అభివృద్ధికి దిక్సూచిగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పెట్టిన ట్వీట్పై స్పందించారు. “ శ్రీరంగపట్నం, కూర్గ్, ఊటీ, కేరళ వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ లభించడంతో పాటు టూరిజం అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి” అని గడ్కరీ ట్వీట్ చేశారు. మార్చి 12న నరేంద్ర మోదీ ఈ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించనున్నారు.