తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంంఠ కాంప్లెక్సుల్లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి పోయాయి. నిన్న 70 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. మరో 31 వేల మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. బుధవారం వెంకన్న హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.