తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠ కాంప్లెక్సుల్లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 60,765 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 26,725 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.