ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళఖాతంలో ఈనెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అది 20 నాటికి అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమంగా ఏపీ- ఒడిశా తీరం వైపు కదులుతూ.. 24,25 తేదీల్లో తుపాన్గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తర్వాత సూపర్ సైక్లోన్గా మారనున్నట్లు తెలిపింది.
ఏపీకి తుపాను ముప్పు

© ANI Photo