హైదరాబాద్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్లను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ విషయాన్ని ట్విటర్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. “ ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఇవాళ్టి రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం” అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, అనుబంధ రంగాల వృద్ధి, హైదరాబాద్లో అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను సత్య నాదేళ్లకు వివరించినట్లు సమాచారం. కొత్త సాంకేతికతపైనా ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.