ఆటలోనే కాదు చదువులోనూ ఓ టీమిండియా క్రికెటర్ రాణించాడు. మధ్యప్రదేశ్కు చెందిన అమె ఖురేషియా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సివిల్స్ క్లియర్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూనే మధ్యప్రదేశ్ నుంచి సివిల్స్కు ఎంపికయ్యాడు. 1999లో శ్రీలంకపై డెబ్యూ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో ఖురేషియా(57) అర్థసెంచరీతో రాణించాడు. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక కనుమరుగయ్యాడు. ప్రస్తుతం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నాడు.