తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో భారాస విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో నేతలకు దిశా నిర్దేశం చేసిన కేసీఆర్… నేతలు నియోజకవర్గాల్లో ఉండాలని సూచించారు. ” ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు. డిసెంబర్లో ఎన్నికలు ప్లాన్ చేసుకోండి. అవసరమైతే పాదయాత్రలు చేయండి. నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి నిత్యం ప్రజల్లో ఉండాలి” అని పేర్కొన్నారు.