‘లవ్ యూ బంగారం….ఐ లవ్ యూ డార్లింగ్…. నీతో మాట్లాడి ఎన్నాళ్లైందో!ముందు నీ ఫొటో పంపు, నాలుగో తేదీన దిల్లీలో కలుద్దామా’ అంటూ ఓ మహిళతో సాగిన ఓ సంభాషణ ఆదివారం నెట్టింట వైరల్ అయింది. ఆ స్వరం మాజీ మంత్రి, వైకాపా విశాఖ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావుదేనంటూ కథనాలు వెలువడ్డాయి. ఫోన్లో మహిళ తాను ‘ప్రియాంక రెసిడెన్సీ’కి ఇళ్లు మారుతున్నానని చెప్పగా అక్కడికి వద్దని తన కూతురు పసిగడుతుందని అంటున్నట్లుగా ఆడియో ఉంది. గతంలో ముత్తంశెట్టికి సంబంధించిన ఆడియోపై ఇంకా విచారణ పూర్తి కాకముందే మరో ఆడియో రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాను 15 రోజులుగా అయ్యప్ప స్వామి మాలలో ఉన్నానని దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని ముత్తంశెట్టి చెప్పారు.
‘లవ్యూ బంగారం’ మాజీ మంత్రి ఆడియో వైరల్

Courtesy Twitter:@AvanthiSrinivas