ఈ ఏడాది జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ బెర్తులు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, ఇండియా ఫైనల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. జూన్ 7 నుంచి 11 వరకు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ‘ద ఓవల్’ స్టేడియం ఈ తుది సమరానికి ఆతిథ్యం ఇస్తుంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పోటీపడుతున్నాయి. ఈ రెండు జట్లు తటస్థ వేదికపై ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్పై ఆసక్తి పెరిగింది. మరి, ఇంగ్లాండ్ గడ్డపై ఇండియన్ క్రికెటర్లు కంగారూలకు కళ్లెం వేస్తారా? లేక తడబడతారా అనేది వేచిచూడాల్సిందే.