కేంద్రం పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఫ్లూ కలకలం రేగింది. హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా వైరస్ విలయ తాండవం చేస్తోంది. దీంతో 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ఏ.నమశ్శివాయం తెలిపారు.. ఈ నెల 16 నుంచి 26 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. కాగా పుదుచ్చేరిలో ఇప్పటివరకు దాదాపు 80కి పైగా హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా కేసులు నమోదయ్యాయి.