ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద 2023–24 విద్యా సంవత్సరానికి ఏపీలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న చిన్నారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. వార్షిక ఆదాయం రూ.1,20,000 (గ్రామీణం), రూ.1,44,000 (పట్టణం) కలిగిన కుటుంబాల పిల్లలను అర్హులుగా పరిగణిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.