హైదరాబాద్ లో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం చేసిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జైళ్ల శాఖ సిబ్బంది, ఓ ఖైదితో కలిసి ఈ మోసాలకు పాల్పడగా..సుమారు 9 వేల మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జైళ్ల శాఖలోని 200 మంది సిబ్బంది రూ. 2 కోట్లు పెట్టుబడులు పెట్టారని సమాచారం. వివిధ జిల్లాల కారాగారాల్లోని సిబ్బంది డబ్బు కట్టారని వినికిడి. లక్ష పెట్టుబడకి రోజుకు 2500 కమిషన్..240 రోజుల తర్వాత రూ. 4.21 కోట్లు, జాయిన్ చేస్తే రూ.700 కమిషన్ ఇస్తామని మోసం చేశారు.
ట్రేడింగ్ పేరుతో గ్యాంబ్లింగ్

© Envato