జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం చేపట్టింది. నగరవ్యాప్తంగా వృథా నూనెను సేకరించాలని నిర్ణయించింది. హోటళ్ల నిర్వాహకులు వృథా నూనెను వ్యాపారులకు ఇవ్వకుండా జీహెచ్ఎంసీనే తీసుకోనుంది. కిలో వృథా నూనెకు రూ.25 చొప్పున చెల్లించి కొనుగోలు చేయనుంది. ఈ బాధ్యతలను జీహెచ్ఎంసీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. 8985557397, 9705149048 నంబర్లను సంప్రదించి నూనెను అమ్మవచ్చు. వృథా నూనెను బయోడీజిల్ కేంద్రాలకు తరలించి, జీవ ఇంధనం తయారు చేస్తారు.
జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం

Courtesy Twitter: Bengal Biodiesel