తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.350 పెరిగి రూ.52,350కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.380 పెరగి రూ.57,110కి ఎగబాకింది. అటు కిలో వెండి ధర రూ.72,100 వద్ద కొనసాగుతోంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.