తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.51,600కు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.56,290కి ఎగబాకింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.74 వేల వద్ద కొనసాగుతోంది. అటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. పసిడి ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనేందుకు సామాన్యులు భయపడుతున్నారు.