తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుతూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శుక్రవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఇప్పటిదాకా 6 శాతంగా ఉన్న ST రిజర్వేషన్లు 10 శాతానికి పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 17న జరిగిన ఆదివాసి, గిరిజన ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఏడేళ్ల క్రితమే రిజర్వేషన్లకు రాష్ట్రపతి ఆమోదానికి పంపినా స్పందన లేదని, అందువల్ల ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ సర్కారు నిర్ణయం
