అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని భారత మాజీ కెప్టెన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.‘‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే దిశగా అడుగులు వేస్తా. కామారెడ్డి నుంచి పోటీ చేయాలనుకుంటున్నా.’’ అంటూ వ్యాఖ్యానించారు.