ప్రధాని మోదీ దోస్తు దొంగతనాన్ని బయటపెడితే దేశంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో విరుచుకుపడ్డారు. దేశమంటే మోదీ, అదానీయేనా అని ప్రశ్నించారు. ‘‘ మోదీ దేవుడని బండి సంజయ్ చెబుతున్నారు. సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1200కు పెంచినందుకా? నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని చంపినందుకా? చేనేత రంగంపై పన్ను వేసినందుకా?…రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి చేయనందుకా? రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థ ఇవ్వనందుకా? మరి ఎవరికి, ఎందుకు దేవుడయ్యాడు?” అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు.