గత సంవత్సరం మార్చి నాటికి దేశంలో రూ.31.33 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. 2014 ఏడాదిలో రూ.13 లక్షల కోట్ల కరెన్సీ ఉండగా గత మార్చికి ఈ స్థాయికి పెరిగిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2014 మార్చిలో GDPలో 11.6 %గా ఉన్న బ్యాంక్ నోట్లు, నాణేల వాటా, 2022 మార్చి కల్లా 13.7% పెరిగింది. 2016లో రూ.16.63 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండగా నోట్ల రద్దు కారణంగా రూ.13.35 లక్షల కోట్లకు తగ్గింది. 2018 మార్చికి రూ.18.29 లక్షల కోట్లు ఉన్న కరెన్సీ, 2022 నాటికి రూ.31.33 లక్షల కోట్లకు ఎగబాకింది.