జూన్ 1న హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిచిపోనుందని HMWSSB ప్రకటించింది. పైపులైన్ల మరమ్ముత్తులు చేపడుతున్న కారణంగా జూన్ 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి జూన్ 2, 2022, గురువారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయ ఏర్పడుతుందని తెలిపింది. ప్రజలు ముందుగానే అప్రమత్తమై తగిన ఏర్పాట్లను చేసుకోవాలని తెలిపింది. మణికొండ, కోకాపేట్, గండిపేట్, నార్సింగి, మంచిరేవుల, హుడాకాలనీ, పుప్పాలగూడ, బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ, తారానగర్, గంగారం, చందానగర్ వంటి పలు ప్రాంతాలో ఆరోజు నీటి సరఫరా నిలిచిపోనుంది.