టీమ్ఇండియా బౌలర్ జులన్ గోస్వామి జీవిత కథతో వస్తున్న ‘చక్దా ఎక్స్ప్రెస్’ చిత్రంలో బాలీవుడ్ నటి అనుష్క శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె విరాట్తో పెళ్లి తర్వాత తన ప్రాధామ్యాలు మారిపోయినట్లు తెలిపారు. ‘వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక నటిగా నా ప్రాధామ్యాలు మారాయి. పాప వామికను చూసుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. గతంలోలా పోటీ పడి నటించే ఆలోచన లేదు. ఏదో నటించాలని మాత్రం సినిమాలు ఒప్పుకోను. అలా వృథా చేసేంత సమయం నా దగ్గర లేదు’ అని అన్నారు.