భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. చివరి రోజు టీ బ్రేక్ సమయానికి ఆసీస్ 158/2తో నిలిచింది. భారత్ ఇంకా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. చివరి రోజున మరో సెషన్ మాత్రమే మిగిలి ఉంది. ఇంకా 32 ఓవర్ల పాటు ఆట సాగనున్న నేపథ్యంలో జట్ల మధ్య ఫలితం తేలడం కష్టమే. ప్రస్తుతానికి ఆసీస్ 67 పరుగుల లీడ్లో ఉంది. పిచ్ ప్రభావం కూడా పెద్దగా లేకపోవడంతో అద్భుతాలు జరగడం కష్టమే. మరోవైపు, ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి దూసుకెళ్లింది.