ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందించింది. IMF వద్ద శ్రీలంక తీసుకునే రుణాలకు భారత్ పూచికత్తు హామీని అందిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీలంక పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ఈమేరకు వెల్లడించారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘేతో ఆయన సమావేశమయ్యారు. శ్రీలంకలో తమిళుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమిళులతో చర్చలు జరిపి వారి సమస్యలు తెలుసుకుంటామని విక్రమ్ సింఘే హామీ ఇచ్చారు.