ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సీరీస్కు టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా ఈ సీరీస్ మొత్తానికి అయ్యర్ అందుబాటులో ఉండడని భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 సీజన్కు కూడా శ్రేయస్ దూరం కానున్నాడు. ఈ విషయమై కేకేఆర్ యాజమాన్యం ఆందోళనలో ఉంది.