టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా గుజరాత్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల జడేజా దంపతులు ప్రధాని మోదీని కలిశారు. అనంతరం జడేజా తన కెరీర్ తొలినాళ్లలోని జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. ‘2010లో గుజరాత్ మోతెరా మైదానంలో ధోనీ మా టీమ్ని మోదీకి పరిచయం చేస్తున్నాడు. నా వంతు రాగానే మోదీ కల్పించుకుని.. ఇతడు మా వాడు, జాగ్రత్తగా చూసుకోండి అంటూ ధోనీకి సూచించారు. మోదీజీ అలా చెప్పగానే ఎంతో సంతోషమేసింది’ అని జడేజా గుర్తు చేసుకున్నాడు. గుజరాత్కే చెందిన జడేజా ప్రస్తుతం భార్యతో కలిసి ప్రచారం చేస్తున్నాడు.
ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న జడేజా

Courtesy Twitter:ravindra jadeja