వచ్చే ఎన్నికల్లో గెలిచి ఏపీలో అధికారం చేపడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. సభలో పవన్ మాట్లాడుతూ ‘‘దెబ్బపడే కొద్దీ జనసేన మరింత బలోపేతం అవుతుంది. ఈ పదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డాం. ఎన్నో మాటలు పడ్డాం. ఎన్నో ఓటములు ఎదుర్కొన్నాం. కానీ జనాల అండతో నిలబడ్డాం. జనాలకు అండగా ఉన్నాం. ఈ సారి ఏపీలో వచ్చేది జనసేన ప్రభుత్వమే.’’ అంటూ పవన్ ఉద్వేగంగా ప్రసంగించారు.