ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాకేశ్ రెడ్డికి జీవిత ఖైదు విధించింది. 2019 జనవరి 31న జయరాంను రాకేశ్ రెడ్డి హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు నాలుగేళ్ల పాటు విచారణ జరిగింది. పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించింది.