‘కాంతార’ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో సినిమాను ప్రదర్శించనున్నారు. నేడు స్క్రీనింగ్ అనంతరం రిషబ్ శెట్టి ప్రసంగిస్తారు. ఇప్పటికే రిషబ్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. ‘కాంతార’ మూవీకి ఈ అవకాశం దక్కడంపై రిషబ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు ఫొటోలను పంచుకుంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా నోట్ని రాశారు. ప్రకృతి ప్రసాదితమైన సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శితం అవుతుండటం గొప్ప విషయమన్నారు. కాగా, ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.