మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ బయల్దేరారు. కవిత వెంట మంత్రి కేటీఆర్, సంతోష్ కూడా ఉన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఈ నెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేశారు. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను విచారిస్తారని తెలుస్తోంది. రేపు ఆమె విచారణకు హాజరవుతారా ? లేదా ? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.